December 21, 2016

ముంజేతిని ఖండించిన నా పిడికిటి కట్టి వదల - చెర

తెలుగు కవుల్లో నాకు అత్యంత ఇష్టమైన కవి చెర.
కేవలం ముప్పై ఎనిమిదేళ్లే బతికినా ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప సాహిత్యాన్ని సృష్టించినవాడు. చెర రాసిన ప్రతి అక్షరం, ప్రతి పదం చాలా వాడిగల ఆయుధం. నిప్పులా కణకణ మండే అక్షరాలవి.
ప్రతీ రచనలో రాజ్యంపట్ల పట్టరాని క్రోథమో, రైతుకూలీలు కష్టాన్ని చూసి కదిలిపోయే కరుణో, యువకులపట్ల గొప్ప ఆశనో కనిపిస్తుంది. కవితలు దొంగ స్వాతంత్రాన్ని ఎండగట్టేవి. విప్లవోద్యమాన్ని తలపోసి యువతీ యువకుల్ని కార్యోన్ముఖుల్ని చేసేవి.
మెదడుని కేన్సర్ తొలిచేస్తున్నా ప్రజలపట్ల, ప్రజా పోరాటాలపట్ల ఏమాత్రం నిబద్ధత తగ్గని అక్షరం, ఆలోచన చెరబండరాజుది.........
పూర్తి పాఠం కోసం కింది లింక్ క్లిక్ చెయ్యండి. 

http://virasam.org/article.php?page=351


November 16, 2016

ఏం!


ఏం, రైతులు త్యాగం చెయ్యడం లేదా మనకోసం? మిమ్మల్ని మేపలేక ప్రాణాలు తీసుకుంటున్నారు కదా?
ఏం, వంటిళ్లలో అమ్మలు, అక్కలు, భార్యలు జీవితాలు నాశనం చేసుకోవడం లేదా, మీరు పీకమొయ్యా తినడానికి అన్నీ సమకూర్చడం లేదా?
ఏం, దళిత, బహుజన స్త్రీలు  చీపుర్లు పట్టుకుని రాత్రుళ్ళు రోడ్లన్నీ శుభ్రం చెయ్యడం లేదా? మీరు కొవ్వెక్కి రోడ్డుమీద పడేసిన చెత్తని ఎత్తడం లేదా?
ఏం, ఇంటింటికీ తిరిగి కూరలమ్మడానికి పొద్దున్నే పిల్లల్ని ఇంట్లో వదిలి, నిద్రని త్యాగం చేసి మండీలకు వెళ్లి రావడం లేదా చిరువ్యాపారులు?
ఏం, పగలనకా, రాత్రనకా, ఎండల్లో వానల్లో బళ్ళమీద కొబ్బరి బొండాలు, అరటిపళ్ళూ, జామపళ్ళూ, సీతాఫలాలూ అమ్మే హాకర్ల కష్టం చూడటం లేదా? 
ఏం, కార్పెంటర్లూ, ఎలెక్ట్రీషియన్లూ, ప్లంబర్లూ, మెకానిక్కులూ, కత్తులు సానబెట్టేవారూ, బట్టలు నేసేవారూ, రోడ్లు వేసే కూలీలూ, పాతపేపర్లు కొనే ముసలి వాళ్ళూ, మిమ్మల్ని ఎక్కడెక్కడికో తిప్పే డ్రైవర్లూ, మీరు ఒళ్ళు కొవ్వెక్కి నానా చెత్తా వేస్తే డ్రైనేజీలు నిండిపోతే రెండో ఆలోచన లేకుండా అందులో ములిగే దళిత శ్రామికులూ, మీ ఇళ్లల్లో నానా మాటలూ పడీ, ఇంట్లోవాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా మీ ఇళ్లల్లో చెత్త తీసుకుని వెళ్లే 'చెత్త' వాళ్ళూ  -- వీళ్ళందరూ త్యాగం చెయ్యడం లేదా?

-- వీళ్ళందరూ చాలీ చాలని ఆదాయాలతో పనిచెయ్యడం వల్లనే, వీళ్ళతో గీచి గీచి బేరమాడడం వల్లనే కదా మీ పర్సుల్లో కొన్ని నోట్లు మిగులుతున్నవి? 

--- వీళ్లందరి సామూహిక శ్రమ వల్లనే కదా మీరు హాయిగా తింటున్నారు, హాయిగా రోడ్లమీద ఉమ్ముతున్నారు, ఆలోచన లేకుండా చెత్తవేస్తున్నారు, హాయిగా ఇంట్లోకూచుని బొర్రలు పెంచుకుంటున్నారు. 


-- ఇంత మంది ఇన్ని రకాలుగా త్యాగం చేస్తే, కష్టం పడితే మీరు హాయిగా నిద్రపోతున్నారు. దేశభక్తి గురించి పాఠాలు చెప్పకు. సరిహద్దు దగ్గర నిల్చున్న (కాశ్మిర్లో దుర్మార్గాలకు పాల్పడుతున్న) సైనికుల కుటుంబాలకు అండగా నిల్చుని వాళ్ళు కూడా హాయిగా నిద్రపోడానికి సహాయపడుతున్న వాళ్ళం.

-- వీళ్ళకి ఇప్పుడు కష్టం వస్తే, వీళ్ళకి ఇప్పుడు జీవనోపాధి పొతే, వీళ్ళే ఇప్పుడు దీనంగా క్యూలలో కూచుంటే, దేశభక్తిలేదని మళ్ళీ వాళ్లనే తిడతావేంట్రా దేశభక్తా? 

October 26, 2016

పూలగుర్తులు

పూలగుర్తులు



పూలమ్మిన చోటనే కట్టెలమ్మాల్సి వస్తుందని అందరూ చెప్పారు నేను పూల దుకాణం పెడుతుంటే. నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్లనే మొండివాణ్ని కాదు.
నా మేలు కోరి చెప్పిన వాళ్ల మాట కాదనలేను. అలాగని నా పుర్రెలో పుట్టిన ఐడియాను చంపుకోలేను. అందుకని ఉభయతారకంగా పూలదుకాణం పెట్టి పక్కనే మొక్కల నర్సరీ కూడా పెట్టాను. Say it with flowers (పూలిచ్చి మీ ప్రేమను ప్రకటించండి) అని షాపుకు పేరు పెట్టాను.
ఇంటర్నెట్‌ లేకపోతే ఎలా ఉండేదో కానీ, దాని పుణ్యమా అని బాగానే సంపాదిస్తున్నాను. ముఖ్యంగా అమెరికా, యూరోపు దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు తల్లిదండ్రుల్నీ, తోబుట్టువుల్నీ, చుట్టాల్నీ మరిచిపోలేదని చెప్పడానికన్నట్టు పూలు, బొకేలు ఆర్డర్లు పంపేవాళ్లు. అందుకోసం sayitwithflowers అన్న వెబ్‌సైట్‌ ఒకటి ఓపెన్‌ చేసాను.
నా షాపులో నేనందించే సర్వీసులు, మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే, బ్రదర్స్‌ డే, చిల్డ్రన్స్‌ డే, వేలంటైన్స్‌ డే ఇట్లాంటి దినాల వివరాలు పెట్టాను. నా వెబ్‌సైట్‌లో రిజిష్టర్‌ చేసుకున్న వాళ్లకు ఆయాదినాల గురించి ఇమెయిల్‌ ఎలర్ట్‌లు పంపే ఏర్పాటు కూడా చేశాను. అందువల్ల అమ్మకాలు జోరుగానే ఉన్నాయి.
పూల షాపులోనే కాదు నర్సరీకి కూడా కస్టమర్లు బాగానే వస్తున్నారు.
మిగతా నర్సరీల్లా కాకుండా నేనేం చేసే వాడినంటే ఏ మొక్క కొంటే బాగుంటుందో చెప్పి కొనిపించే వాడిని. పూల మొక్కల్ని కొనడానికి వచ్చే వాళ్లకు రకరకాల క్రోటన్‌ మొక్కల్ని వాటి ఆకుల అందాల్ని చూపించి కొనిపించే వాడ్ని.
కస్టమర్లతో మాట్లాడి వాళ్ల ఇష్టాయిష్టాలను బట్టి, వాళ్ల ఇళ్ల సైజులు బట్టి మొక్కల్ని సూచించేవాడ్ని. షాపు మధ్యలో రకరకాలుగా మొక్కల్ని అమర్చి చూపించేవాడ్ని. హాలు మధ్యలో మట్టి, ఇత్తడి పళ్లాల్లో నీళ్లు పోసి నాలుగు రకాల పువ్వుల్ని పెడితే ఎంత బాగుంటుందో చూపించి నాలుగైదు రకాల పూలమొక్కల్ని అమ్మేవాడ్ని.
నేను చెప్పేది కొందరికి నచ్చేది. కొందరికి నచ్చేది కాదు. కానీ వాళ్ల ఎంపికలో నేను చూపించే చొరవ మాత్రం నచ్చేది అందరికీ. కరివేపాకు మొక్క కొనడానికి వచ్చిన వాళ్లనీ, ఖరీదైన షోకు మొక్కల్ని కొనడానికి వచ్చే వాళ్లనీ ఒకేలా చూసేవాడ్ని. దాంతో ఊళ్లో మొక్క కావలసిన వాళ్లెవరికైనా ముందు గుర్తుకు వచ్చేది నా షాపే.
షాపు పెట్టిన సంవత్సరంలో చాలమంది కస్టమర్లను చూసాను. బాగా డబ్బుండి టోకున మొక్కల్ని కొనేవాళ్లనీ చూసేను. ఒకే ఒక్క మొక్కని కొన్న వాళ్లనీ చూసాను. కానీ ఒక కస్టమర్‌ మత్రం అర్థమయ్యేవాడు కాదు. ఒకరోజు బంతిమొక్క కొంటే, ఇంకో రెండు రోజుల తర్వాత గులాబి మొక్కలు రెండు కొనేవాడు. కొన్ని సార్లయితే ఐదారు మొక్కలు కొనేవాడు.
అరవై ఏళ్లుంటాయి కావచ్చు. సాదా బట్టలు వేసుకునేవాడు. కొనుక్కున్న మొక్క లేదా మొక్కల్ని గుడ్డ సంచిలో వేసుకు వెళ్లేవాడు.
అతనొచ్చినప్పుడల్లా నా మొక్కల పరిజ్ఞానాన్నంతా ప్రదర్శించడానికి ప్రయత్నించే వాడ్ని. కానీ నా మాటల్ని పట్టించుకోకుండా తను కొనాల్సింది కొనుక్కు వెళ్లేవాడు. నాకు క్రమక్రమంగా ఈ కస్టమర్‌ మీద ఆసక్తి మొదలైంది. అందుకే అతడెప్పుడొచ్చినా ఏం కొన్నా జాగ్రత్తగా గమనించే వాడిని. గమనిస్తున్న కొద్దీ నాకాయన మీద ఉత్సుకత పెరిగిందే గానీ తగ్గలేదు. ఒక్కోసారి వారాల తరబడి వచ్చేవాడు కాదు. అసలు ఇన్ని మొక్కలు ఏం చేస్తున్నాడు? మళ్లీ ఎవరికైనా అమ్ముకుంటున్నాడా?
“ఈసారొచ్చినపుడు అతడిని వెంబడించి వెళ్లాలి” అని అనుకున్నాను.
నేనలా అనుకున్న కొన్ని రోజులకు రానే వచ్చాడు. అయితే ఎప్పటిలా ఒక్కడే కాకుండా ఐదారేళ్ల బాబును వెంట తీసుకొచ్చాడు ఒక రోజు మధ్యాహ్నం. మనిషి ఎప్పటికంటే గంభీరంగా ఉన్నాడారోజు. బంతీ, చామంతీ, గులాబీ – అన్నీ కలిపి ఏకంగా ఎనిమిది మొక్కలు కొన్నాడు.
కౌంటర్లో కూచున్న నా దగ్గర కొచ్చాడు డబ్బులియ్యడానికి. అతను తీసుకున్న మొక్కల్ని చూస్తూ చిన్న కాగితం మీద ఎంతయిందో లెక్కవేసి చెప్పాను. అతను పాంట్‌ జేబులోంచి డబ్బులు తీసి లెక్కపెట్టి నాకు ఇవ్వాల్సినవి తీసిచ్చాడు.
“ఎవరూ? మనవడా?” అనడిగాను.
“అవున”న్నాడు.
నేనేం మాట్లాడకుండానే తనే అన్నాడు. “కూతురు కొడుకు. టౌన్‌లో ఉంటారు. వాడు పుట్టాక ఇదే రావడం”.
కాలర్‌ ఉన్న తెల్లటీషర్ట్‌, నల్లటి నిక్కర్‌ వేసుకున్నాడు.
ఈ పూల మొక్కల షాపులో వాడొక తెల్లగులాబీ పువ్వులా ఉన్నాడు.
“నీ పేరేంటీ?” అనడిగాను.
ముద్దుముద్దు గొంతుతో ‘రమాకాంత్‌’ అన్నాడు.
నాకు రావాల్సిన డబ్బులు తీసుకుని చిల్లర ఇచ్చేను.
డబ్బులు జేబులో పెట్టుకుని షాపు బయటకు నడిచేరిద్దరూ.
వాళ్లలా బయటకు వెళ్లగానే నా అసిస్టెంట్‌ను పిలిచేను. ‘కాసేపు బయటకు వెళ్లొస్తాను, షాపు చూడమ’ని చెప్పి బయటకెళ్లి చూసేను. ఒక చేత్తో మొక్కల సంచిని మరో చేత్తో మనవడి చేతిని అపురూపంగా పట్టుకుని అతడు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాళ్లు ఇంకొంచెం దూరం వెళ్లేదాకా ఆగి వారిని అనుసరించాను.
టైం నాలుగవుతుంది. పడమరకు వాలుతున్న ఎండలో తాతా మనవళ్ల నీడలు తూర్పున పడుతున్నాయి. మనవడు ఏదో అడిగినట్టున్నాడు, అటువైపు తిరిగి ఏదో చెబుతున్నాడు. తలపైకెత్తి తాత మొహంలోకి చూసి మళ్లీ ఏదో అడిగాడు మనవడు. రోడ్డుమీద వాహనాల చప్పుడులో వాళ్ల మాటలు అక్కడే గాలిలో కలిసిపోతున్నాయి.
వాళ్లలా రెండు మూడు వీథులు దాటి చెరువు పక్క పెంకుటింటి పక్కన ఆగారు. నేపాళం కర్రలతో కట్టిన దడి తలుపు తీసుకుని లోపలికెళ్లారు. వాళ్లు లోపలికెళ్లే దాకా ఆగి నేనూ అటువైపు వెళ్లాను, చెరువువైపు వెళ్తున్నట్టు. వాళ్ల గేటు దగ్గరకు చేరుకోగానే తలతిప్పి వాళ్ల ఇంటివైపు చూసాను. ఇంటిముంది అరుగుమీద రెండు కుర్చీలు ఉన్నాయి. ఒక మూల గాదె ఉంది. మెల్లగా గేటు తీసి లోపలికెళ్లాను. ఇంటి తలుపు సగం తెరచి ఉంది. ఎదురుగా ఉన్న గోడమీద ఒక యువకుడి ఫొటో వేళ్లాడుతోంది.
ఇంటి పక్క ఖాళీ ప్రదేశంలో ఏదో మాటల అలికిడి వినిపించడంతో అటువైపు వెళ్లాను. గోడ దగ్గర ఆగిపోయి చూసాను. దాదాపు ఇల్లెంత ఉందో ఖాళీ ప్రదేశం అంతే ఉంది. అక్కడక్కడా పూల మొక్కలు, చిన్నవీ పెద్దవీ ఉన్నాయి. బుల్లి రమాకాంత్‌ గొంతుకిలా కూచుని సంచిలోంచి మొక్కలు బయటకు తీస్తున్నాడు. పెరట్లోని పాకలోంచి బూరిగె తీసుకొచ్చి మనవడి దగ్గరపెట్టి నుయ్యి దగ్గరకెళ్లి బకెట్‌తో నీళ్లు తీసుకొచ్చాడు తాత.
అక్కడక్కడా నీళ్లు పోసీ చిన్న చిన్న గోతులు తవ్వుతూ ఒక్కొక్క మొక్కా పాతుతున్నారు ఆ ఇద్దరూ. చల్లటి గాలికి ఆ చిన్న పూతోటలో మొక్కలు – రకరకాల రంగులవీ, వాసనలవీ – మెల్లగా హాయిగా విలాసంగా వూగుతున్నాయి.
“వీటికి నువ్వు రోజూ నీళ్లు పోయాలి నువ్వు ఉన్నన్ని రోజులు” అన్నాడు తాతయ్య.
“పోస్తాను గానీ తాతయ్యా, ఇన్ని మొక్కలెందుకు తాతయ్యా,” అనడిగాడు మనవడు.
ఆ ప్రశ్న విన్నాడో లేకపోతే పనిలోపడి ఆ మాటలు పట్టించుకోలేదో తెలీదు కానీ కాసేపు ఏమీ మాట్లాడలేదు తాత. అప్పుడే పాతిన మొక్క మొదలు దగ్గర కొంచెం మట్టి పోసి రెండు చేతులతో ఒత్తాడు.
“అసలిన్ని మొక్కలెందుకు కొన్నావు తాతయ్యా” అని మళ్లీ అడిగాడు రమాకాంత్‌.
“ఈ రోజు పొద్దున్నే ఎనిమిది మంది చనిపోయారు నీ కోసం, నా కోసం. మీ కోసం చనిపోయిన వాళ్ల కోసం మీరేం చేశారని ఎవరైనా అడిగారనుకో, ఇవి చూపిద్దాం. ఇక్కడ పూసే పూలగాలుల్లో వాళ్లు మన కళ్లల్లో మెదుల్తుంటారు,” అన్నాడు తాతయ్య.
అతడి మాటలు వింటూ పెరడంతా చూసాను. సాయంత్రపు నీరెండలో పువ్వులు కొత్త కొత్త రంగులు ప్రకటిస్తున్నాయి. నాకిప్పుడు ఆ మొక్కలు నాకు డబ్బులు కురిపించే చెట్లలాగా అనిపించడం లేదు. కొత్త ప్రాణం పోసుకున్నట్టు తోస్తున్నాయి. ఎవరెవరివో జ్ఞాపకాలకు గుర్తులుగా కనిపిస్తున్నాయి. మెల్లగా బయటకొచ్చి షాపు చేరుకున్నాను.
ఒకరోజు పొద్దున్నే పేపరు తీసి ఒక వార్త చదువుతుంటే అనిపించింది. ఈ రోజు తప్పకుండా అతడు నా షాపుకు వస్తాడనిపించింది. షాపు తెరచిన కాసేపటికి నేననుకున్నట్టుగానే వచ్చాడు. అతడికోసమే రడీగా పెట్టుకున్న గడ్డి గులాబీ మొక్కొకటి తీసి అతడి చేతిలో పెట్టాను. వద్దనలేదు. ఇంకోమొక్క వెతుక్కునే ప్రయత్నమూ చెయ్యలేదు. అతడి కళ్లలోకి చూసాను. ఉబికి వచ్చి కనుగుడ్లపై ఆగిపోయిన కన్నీళ్లు కనిపించాయి.
(మాధవ్‌, రజిత, రవి, ప్రసాద్‌లకు ఇంకా ‘అనేకానేక మందికి) (July, 2007, Online Literary Magazine -- Pranahita)
(Now, for those 31 killed in AOB)


October 20, 2016

తల్లి భూదేవి - మట్టి మనుషుల జీవితమూ, యుద్ధమూ

ఎన్నో పుస్తకాలు చదువుతాం. కానీ కొన్ని పుస్తకాలు, అందులో కొన్ని పాత్రలు మాత్రం జీవితాంతం వెంటాడుతూంటాయి. అలాటి పుస్తకాలలో ʹతల్లి భూదేవిʹ (Mother Earth) ఒకటి. అలా వెంటాడే పాత్రల్లో తొల్గొనాయ్, అలిమన్ లు.

డెబ్భైల్లో, ఎనభైల్లో విప్లవోద్యమాల్లోకి, వామపక్ష ఉద్యమాల్లోకి వచ్చినవాళ్లు ఈ పుస్తకం చదవకుండా రాలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. విప్లసాహిత్య శిబిరాల్లో మొట్టమొదట చదవాల్సిన పుస్తకాల్లో ఈ పుస్తకం ఒకటి. ఒకసారి ఈ పుస్తకం చదివితే ఇందులోని పాత్రలు, తొల్గొనాయ్, అలిమన్, మనకు ఆప్తులు అయిపోతారు. మన నిజ జీవితాల్లో అలాటివాళ్ళు మనకి ఎక్కడో ఓ సారి మనకి తారసపడే వుంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ బాధలు, జీవితమ్మీద, మనుషులమీద ప్రేమతో వాళ్ళు మాట్లాడే మాటలు, సత్యం కోసం వాళ్ళు పడ్డ కష్టాలు -- మరెప్పటికీ మనమీద చెరగని ముద్ర వేస్తాయి.
చింగీజ్ ఐత్ మాతొవ్ ఒకప్పటి సోవియట్ యూనియన్ లోని కిర్గిజ్ ప్రాతానికి చెందిన గొప్ప రచయిత. రష్యన్ విప్లవం విజయవంతమైన తర్వాత పుట్టిన తరానికి చెందిన వాడు. తన ముందరి తరాల రచయితలు, విప్లవానికి, రష్యన్ సమాజానికి దారిచూపించిన మహా రచయితలైన చెహోవ్, గోర్కీ, టాల్ స్టాయ్, మైకోవిస్కి వంటి గొప్ప రచయితల వారసత్వాన్ని కొనసాగించినవాడు..........
The Link to the Original article.
http://virasam.in/article.php?page=283

October 05, 2016

ఈ పుస్తకం చదివేరా?

http://virasam.in/article.php?page=269

కొందరి రచయితలు రాసిన కొన్ని పుస్తకాలు మహా గ్రంథాలుగా నిలిచిపోతాయి. శ్రీ శ్రీ అనగానే మహాప్రస్థానం, పతంజలి అనగానే వీరబొబ్బిలి, రాజయ్య అనగానే కొలిమంటుకున్నది, జాషువ అనగానే గబ్బిలం, కారా అనగానే యజ్ఞం మనకు గుర్తొస్తాయి. ఈ గుర్తుకురావడం ఎంతవరకూ పోయిందంటే వాళ్ళు రాసిన ఇతర రచనలేవీ రచనలుగా పరిగణించనంతగా. 
దీనివల్ల నష్టం మనకే గానీ వాళ్లకి కాదు. ఒక్క పుస్తకం చదవకుండా వదిలేసామంటే ఒక గొప్ప అనుభవాన్ని వదిలేసుకుంటున్నట్టే. ముఖ్యంగా రచయితలు squander చేసుకుంటున్నది అంతాఇంతా కాదు........

October 02, 2016

జలగలు

నెలమొత్తం కష్టపడి టైమూ, డబ్బులూ చూసుకుని ఒక్క సినిమా చూద్దామని వెళ్తామా, అదే మన నెత్తిన భస్మాసుర హస్తమవుతుంది. 

రాత్రి తెర కనిపించిన వాళ్ళు పొద్దున్నకల్లా టీవీల్లోకి, హోర్డింగుల మీదికి, పత్రికల్లోకి, ఫేస్బుక్కుల్లోకి, ట్విట్టర్లలోకి ప్రత్యక్షమవుతారు. 

అది కొని దాహం తీర్చుకో, ఈ బట్టలు కొనుక్కో, ఆ టీవీ కొను, ఆ షాపులో బంగారం కొను, ఇక్కడ తాకట్టు పెట్టు, ఫలానా చోట ఇల్లు కొను, ఫలానా పార్టీ వాడికి ఓటెయ్యి, ఈ పౌడరు కొను, ఆ సబ్బు కొను, ఈ నూడుల్స్ తిని చూడు, ఆ లాగు కొనుక్కో, తలకి ఆ కంపెనీ వాడి రంగేసుకో -- అని వెంటాడుతుంటారు. 
వాళ్ళు బహుశ పక్కపక్క ఇళ్లల్లోనే వుంటారు. తరుగు భారం లేని బంగారం కొనమంటాడొకడుడు. తర్వాత తాకట్టుపెట్టమంటాడొకడు. పాత సామాన్లు అమ్మేసి తాజా సామాన్లు కొనుక్కోమంటాడొకడు. ఒకషాపులో బంగారం కొనమని తండ్రి చెప్తాడు, పక్క షాపులో సూట్లు కొనుక్కోమని  కొడుకు చెప్తాడు. అదే షాపులో పట్టుచీరలు కొనుక్కోమని కాబోయే కోడలు చెప్తుంది.
ఇంకొకడు రమ్మీ ఆడమంటాడు, ఇదిగో కొంచెం బోనస్ ఇస్తున్నా ఆడి చూడు మజా వస్తుందంటాడు. ఇంకొకడు చల్ల చల్లటి నూనె కొనుక్కోమంటాడు. మరొకడు మరొకటి అంటాడు.
కొందరు వస్తువులకీ, మరికొందరు పార్టీలకీ ప్రచారం  చేస్తారు. ఆ మురిపాలు చూసి, ఆ హొయలు చూసి, ఆ తొడగట్టే ఆవేశాలు చూసి -- ఇల్లూ, వళ్ళూ పాడు చేసుకుని దివాళా తీసి కుదేలై ఉంటాం మనం. వాళ్లు మాత్రం ఎప్పుడూ తళ తళా మెరుస్తుంటారు. ఎగిరే జుత్తు చూసి, వస్తువుల కోసం వాళ్ళు వడుపుగా చేసే విన్యాసాల గురించి మనం అచ్చెరువొందుతూ జేబులు ఖాళీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఏ ఒక్క గాడిద కూడా ఈ నెలంతా వర్షాలు పడ్డాయి, వరదలొచ్చాయి ఏం తిని బతుకుతున్నారు? దిక్కుమాలిన రోడ్లమీదపడి రోజులు ఎలా వెళ్లదీస్తున్నారు? రోజులు గడుస్తున్నాయా? డెంగీ జబ్బుల బారిన పడి మీ పిల్లలు ఎలా లుగుతున్నారు,  అని అడగరు. తొడలుగొట్టరు, గర్జించరు. జాబులు ఇస్తామన్న వారు జాబులు ఇచ్చారా అని అడగరు. 

కానీ, కోకులు తాగండి, నూనెలు వాడండి, నూడుల్స్ తినండి, బంగారం కొనండి, ఆ నాయకుడికి ఓటెయ్యండి  అంటూ వాళ్ళు చేసే ప్రచారం ఆగదు.
మన జేబుల్లో డబ్బులన్నీ వాళ్ళ ఇళ్లలోకి వెళ్లిపోతాయి. మన మీద పెత్తనమంతా వాళ్ళు ప్రచారం చేసిన వస్తువలకి, నాయకులకి వెళ్ళిపోతుంది.
దుర్భరమైన ఈ జీవితం నుంచి కొంచెం సాంత్వన కోసం ఓరోజు సాయంత్రం సినిమాకి వెళ్తాం. 
 

September 28, 2016

Change the way you make films: Goutam Ghose

Dalits and Adivasis live in very bad conditions. their lives are not shown. We need to take care of them. It is very important for us lend voice to their issues.
Though development is important, it is equally crucial to ensure it is constructive. “If development results in displacements, it would lead to conflicts. You need to balance the act in order to avoid conflicts and ensure peace,” Goutam Ghose observes.
Change the way you make films: Goutam Ghose: ‘Smartphones pose challenges to film-making’

September 11, 2016

హోదా రొద

ఒక ప్రజడు (కాంగ్రెస్ తో): అప్పుడు హోదా ని చట్టంలో ఎందుకు పెట్టలేదు?
కాంగ్రెస్: అప్పుడు మాకు హోదా వుంది కాబట్టి అలా నమ్మించేం. 

ఒక ప్రజడు(బీజేపీతో): 'హోదా మించిన పేకేజీ' గురించి అప్పుడు అడగకుండా హోదా ఎందుకు అడిగేరు?
బీజేపీ: అప్పుడు మాకు హోదాలేదు. మా హోదా కోసం అలా అనీసేం. 

ఒక ప్రజడు (టీడీపీతో): అప్పుడు హోదా ఇప్పిస్తామన్నారు, పదేళ్లు, పదిహేనేళ్ళుండాలన్నారు. ఇప్పుడు పేకేజీ అంటున్నారు?  
టీడీపీ: మాకు హోదా కావాలని మీకు హోదా కావాలన్నాం. మాకు హోదా వచ్చింది కాబట్టి మీకు కేబేజీ చాలు. 

ఒక ప్రజడు (వైఎస్సార్సీ తో): మీరు హోదా గురించి అడుగుతున్నారు. మీరు ఇప్పిస్తారా?
వైఎస్సార్సీ: మాకు హోదా వచ్చేవరకూ అడుగుతాం. 

ఒక ప్రజడు (జనసేనతో): హోదా కి హామీ అన్నారప్పుడు?
జనసేన: ఇప్పటికీ అంతే, ఎప్పటికీ హామీ ఉంటాం. ఉంటాం. ఉంటాం. అ( అ( అ(

ఒక ప్రజడు (రామోజీ, రాధాక్రిష్ణతో): అప్పుడు హోదా గొప్పదన్నారు. ఇప్పుడు పేకేజీ గొప్పదంటున్నారు?
రామోజీ, రాధాక్రిష్ణ: అప్పుడు 'హోదా' అంటే, ఇప్పుడు పేకేజీ అంటే మా బాబుకి ఇష్టం.  

కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీ, జనసేన, రామోజీ, రాధాక్రిష్ణ  (ప్రజడులతో): హోదా అయితే ఏంటి, పేకేజీ అయితే ఏంటి? ఏదైనా మాకే. చప్పుడు చెయ్యక పనిచూసుకో.   

         

August 26, 2016

అది హృదయమ్ము సుమ్మీ!

ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద, బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముదముడిపోయినన్ సమసిపోవుట లేదిది, దీపమందు మా
హృదయము సుమ్మి! నిల్పి చనియెన్ గత పుత్రిక యే యభాగ్యయో
చిక్కటి చీకటిలో కలిసిపోయిన కొత్త సమాధి. దాని మీద దాదాపు ఆరిపోడానికి సిద్ధంగా వున్న ఆముదపు దీపం వెలుగు పడుతోంది. నూనె పూర్తిగా అయిపోయినా కూడా మిణుగురు పురుగులాగా వెలుగుతూ ఆరుతూ వుంది. దానిని దీపమమని ఎలా అంటాం?
మరి, శ్మశానంలో పెనుచీకట్లలో చిక్కుకుని వెలుగుతున్నది ఏమిటి?
అది, పుట్టిన కొద్ది రోజులకే గిట్టిన బిడ్డను చూసి గుండెచెదిరిన ఓ దిక్కులేని తల్లిది. ఆ చిట్టి సమాధి చెంతనే హృదయం వదిలి పెట్టిపోయింది. ఆమె ప్రాణం అక్కడే కొట్టుమిట్టాడూతూ వుంది. బహుశా, కన్నపేగుకోసం అల్లాడి పోతూ కొడిగట్టుతోంది.
***
ఇది గుర్రం జాషువ గారి ‘శ్మశాన వాటి’ పద్య ఖండిక లోనిది. ఇందులో కేవలం తొమ్మిది పద్యాల్లో ఇదొకటి. ఈ తొమ్మిదిలో కనీసం రెండు (ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….) వినని గ్రామస్తులెవరూ వుండరు. బహుశా , కొన్ని లక్షలమందికి ఈ పద్యాలు కంఠతా ఉంటాయి.
***
ఎంత గొప్పటి పద్యం! తన బాణానికి ఒరిగిన పక్షి పక్కన రోధించిన సహచరుని బాధను వాల్మీకి పట్టుకున్నట్టు , జాషువ పట్టుకున్నాడు. బిడ్డల్ని కోల్పోయిన తల్లుల వేదనని ఎంత గొప్పగా చెప్పేడు! ఎంత సహానుభూతి చెందక పొతే  అంత గొప్పటి expression వస్తుంది!
ఈమధ్య ఈ ‘కాటిసీను’ పద్యాలున్న యూట్యూబ్ లింక్ ని మిత్రుడు పల్లంరాజు గారు షేర్ చేస్తే విన్నాను ఎన్నో ఏళ్ల తర్వాత.
అరుణోదయ రామారావు ఎక్కడ, ఎప్పుడు కనబడినా పద్యాలు పాడించుకోవడం అలవాటైనా అయినా అప్పటి ఆర్టిస్ట్ పాడగా వినడం ఎన్నో ఏళ్లయింది. ఓ నెల రోజులుగా ఈ లింక్ లోని పద్యాలు మళ్ళీ మళ్ళీ వింటున్నా. కాకతాళీయంగా జాషువ గారి రచనల్ని మళ్ళీ చదువుతుండటం వల్ల ఈ పద్యాల్లో కొత్త అర్ధాలు స్ఫురిస్తున్నాయి. జాషువ శైలి, వస్తు వైశాల్యం, సూక్ష్మ దృష్టి అచ్చెరువు కలిగిస్తున్నాయి.
ఈ పద్యాల్ని కొన్ని వందల సార్లు వింటూ పెరిగిన తరానికి చెందినవాడిని. పండుగలప్పుడు, ముఖ్యంగా శివరాత్రికి, అమ్మ తల్లుల పండగలకి — సత్య హరిశ్చంద్ర నాటకం తప్పని సరి. నాటకం వేయించకపోతే ఊరికి పరువుతక్కువ. కాబట్టి ఎలాగో ఒకలా డబ్బులు వసూలు చేసి వేయించేవారు.
అన్ని గ్రామాల్లో వలెనే  హీరమండలం (శ్రీకాకుళం జిల్లా)లో కూడా వేసేవారు – సంవత్సరానికి ఒకటీ లేదా రెండుసార్లు. దీంతో   పాటు రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం లాటివి వేసినా ‘హరిశ్చంద్ర ‘ నాటకం, అందులోనూ ‘కాటి సీను’ చాలా పాపులర్. హరిశ్చంద్ర లోని మిగతా ఘట్టాలు బలిజేపల్లి వారివి అయినా, ఏ నాటక కంపెనీ అయినా కాటి సీను లో మాత్రం  జాషువ పద్యాలు ఉండాల్సిందే . ఎన్నో ఏండ్లు గతించిపోయినవి…; ఇచ్చోటనే సత్కవీంద్రుని….ఈ పద్యాలు రెండు మూడుసార్లు పాడాల్సిందే.
రిహార్సలప్పుడూ , నాటకం వేస్తున్నపుడూ రాత్రంతా పొలం గట్ల మీద కూచుని ఈ నాటకం చూడడం, చాంతాడంత రాగాలు తీస్తూ పద్యాలు పాడడం ఇంకా జ్ఞాపకాల్లో తాజాగా వున్నాయి. నాటకంలో సందర్భం బట్టి , మూడ్ బట్టి రాగం పొడవు , కంఠ స్వరం ఆరోహణావరోహణలు ఉండేవి. కోపాన్ని, కరుణని, ప్రేమని , దర్పాన్ని — అన్ని భావనలని రాగాలతోనూ , పద్యాల్లోని పదాలను పలకడం ద్వారానూ చాలా గొప్పగా పలికించేవారు.
ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప ట్రాజెడీ, హరిశ్చంద్ర. సత్యంకోసం మనుషులు ఎన్ని కష్టాలు భరించి నిలబడతారో చూపిస్తుంది. కాటి సీనులో నాటకం లోని సంఘటనలు పతాక స్థాయికి వస్తాయి. కీలకమైన ఘట్టానికి జాషువ రాసిన పద్యాలు గొప్ప బలాన్ని తీసుకువచ్చాయి . బహుశ , జాషువ తప్ప ఇంకెవ్వరూ అంత బాగా రాయగలిగి ఉండేవారు కాదు.  
తొమ్మిది పద్యాల్లోనే పేద-ధనిక బేధాలు, అసహజ మరణాలు కలిగించే వేదనలు, కాటిని కూడా వదలని చట్టాలు — ఎన్నో విషయాల్ని తీసుకువస్తారు. బిడ్డలకోసం ఎన్ని వేలమంది తల్లులు “అల్లాడి, అల్లాడి” పోయారో అని అంటాడు. ఎంత వేదన పడిఉంటారంటే , వాళ్ళ రోధన విని కన్నీళ్ళలో రాళ్లు కూడా కరిగిపోయాయంటాడు.
దిక్కూ మొక్కూ లేని వాళ్ళకోసం ఏడ్చే వాళ్ళు సమాజంలో ఎవరూ లేరని విమర్శిస్తాడు. అందుకే, అర్ధరాత్రి పూట ఎవరితోడూ లేకుండా నిస్సహాయురాలై వచ్చిన హంసనారి (చంద్రమతి) దైన్యాన్ని చూసి కరిగిపోతాడు. ఎందుకట్లా ఏడ్చి ఏడ్చి బాధపడతావు, కొంచెం తెరిపినపడు అని ఓదారుస్తాడు.
అప్పుడు, రాస్తాడు ‘ముదురు తమస్సులో …’ పద్యాన్ని. పసిపాపని కోల్పోయిన తల్లి వేదనని చెప్పడం మాత్రమే కాదు, నాటకంలో కొద్ది సేపట్లో తాను, తన  సహచరి ఎదుర్కోబోయే విపత్తును సూచన ప్రాయంగా చెప్పడానికి ఒక సాకు. లోహితాస్యుడి మరణాన్ని, అది విని చంద్రమతి ఎంతగా దుఃఖిస్తుందో చెప్పడం జాషువ ఉద్దేశం.
ఆసక్తి వున్నవాళ్లు ఆ పద్యాలు ఇక్కడ వినొచ్ఛు.
ఈ పద్యంలోని ఉదహరించినట్టు, సమాధులమీద దివ్వెలుగా వెలుగుతున్నహృదయాలు హంసనారిదో,  చంద్రమతిదో, Alan Kurdi తల్లిదో, మాయమైన కొడుకు గురించి అల్లాడిన ‘హజార్ చౌరాషిర్ మా’ దో. లేక ప్రపంచ వ్యాప్తంగా రగులుతున్న యుద్ధరంగాల్లో ఒరుగుతున్న వేలమంది పిల్లల తల్లులవో.
అది, అలాటి వ్యధలననుభవిస్తున్న తల్లుల వేదన పట్ల సహానుభూతి చెందిన జాషువాది.
అది హృదయమ్ము సుమ్మీ!
(Original link to the saaranga post: http://magazine.saarangabooks.com/2016/08/24/%E0%B0%B9%E0%B1%83%E0%B0%A6%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81-%E0%B0%B8%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%80/ )

July 23, 2016

కబాలి మనకి నచ్చదు

రజనీకాంత్ ఈ సినిమాలో సూర్యుడిని చేత్తో ఎగరేసి, కాలితో తన్ని విసిరెయ్యలేదు.
మూడు పిల్లిమొగ్గలేసి ఎగిరే విమానం మీద కూచోలేదు. అణుబాంబుని ఆరు ముక్కలు చేసి ఆర్గురు విలన్ల నోళ్ళలో వి సిరెయ్యలేదు.
ప్రపంచంలోని దుర్మార్గుల్ని, దెయ్యాలని అన్నిటినీ ఓడించెయ్యలేదు. 
ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్టు అని ఓ రౌడీ చెప్పినట్టు కాక, "ఎగిరే పక్షుల్ని ఎగరనీయాలి. మీ దయతో పంజరంలో పెట్టి చంపెయ్యకండి" అని చెప్తే ఎలా నచ్చుతుంది? పాతికేళ్ళు జైల్లో మగ్గినవాడికి తెలుస్తుంది వెలుగు విలువ. అందుకే కసిగా తీస్తాడు ఓ పంజరం తలుపుని, ఓ పక్షికి ప్రపంచాన్ని ఇస్తాడు.
రజనీకాంత్  మామూలు మనిషిలా గర్భంలోనే సమాధై పోయిందనుకుంటున్న బిడ్డ బతికి ఉండి ఉంటుందా అని వ్యాకులపడితే, ఎవరో పాప కళ్ళల్లో బిడ్డని చూసుకుంటే మనం ఎలా చూడగలం? 

ప్రాణంలో ప్రాణంలాటి భార్య బతికుందో లేదో, భార్య బతికే ఉందని తెలిసేక కలుసుకోవాలని ఉద్వేగపడితే ఎలా భరిస్తాం? భరించలేం.
భార్య బతికేవుందని తెలిసేక చెప్పనలవికాని ఆనందంతో మామూలు మనిషిలాగ, మనలాగ కూలబడితే, మనకి ఎలా నచ్చుతుంది? నచ్చనే నచ్చదు. 
చేతిలో టేబ్, అందులో ఫేస్ బుక్ కాకుండా చీప్ గా మై ఫాదర్ బాలయ్య బుక్ పట్టుకున్నాడు.
ఏదో స్టైలిష్ గా సూట్ వేసుకోకుండా, ఓ ఇరవై సార్లు ఎందుకేసుకోవాలో అంబేద్కర్ ని కోట్ చేసి మరీ చెప్పేడు.
మనకి నచ్చదు కాక నచ్చదు.

June 26, 2016

Bumping into an unknown musician




ఈరోజు వాకింగ్ కి అస్సలు వెళ్ళ బుద్ధి కాలేదు. బద్ధకం, self-pity. ఎంత లేటైనా సరే వెళ్లి తీరాల్సిందేనని 'లోపలి వాడిని' గద్దించి బయల్దేరాను.
వెళ్లడం ఎంత మంచిదైందో ఒక రౌండ్ పూర్తయ్యాక తెలిసింది.
చల్లటిగాలితో కలిసిపోయిన పాట పార్కును హత్తుకుంది. 
'మేరే సాప్నోంకి రాణి కబ్ ఆయేగీ తు
ఆయి రుత్ మస్తానీ క్యాబ్ ఆయేగీ తు ...'
పాట నన్నక్కడే ఆపేసింది. పక్కనే ఆటో ట్యూన్స్ ని పెట్టుకుని, కిషోర్ గొంతును గొప్ప పారవశ్యంతో మౌత్ ఆర్గాన్ తో అనువాదం చేస్తున్నాడు, ఓ మూల బెంచి మీద కూచుని. ఆటో ట్యూన్స్ ప్లేయర్, వాటర్ బాటిల్, ఇంకా ఓ నాలుగైదు మౌత్ ఆర్గాన్లు వున్నాయి.
వాకింగ్ చేస్తున్న వాళ్లు, ఆడుకుంటున్న పిల్లలు, ఇంకా అక్కడ పనిచేస్తున్న వర్కర్లు -- అసలు వాళ్ళక్కడ వున్నరారన్న ధ్యాసే లేదు ఆయనకు.
ఊపిరితిత్తుల శక్తి మొత్తం కూడదీసి, పాట మీది, సాహిత్యం మీది, సంగీతం మీది గొప్ప ప్రేమను ప్రకటిస్తూ మౌత్ ఆర్గాన్ ను ఊదుతున్నాడు. ట్యూన్ కి తగ్గట్టూ ఊగిపోతున్నాడు. ఒకచేత్తో మౌత్ ఆర్గాన్ ని అటూ ఇటూ వేగంతో తిప్పుతూ, రెండో చేత్తో ట్యూన్ కి తగ్గ గాలిని అందిస్తున్నాడు. గాలి వాటాన్ని వాడుకుని నావని నడుపుతున్న పడవవాడి వడుపు కనిపిస్తుంది అతని చేతిలో.
ఒకదాని వెంట ఒకటి, మధ్యలో పెన్ డ్రైవ్ లోని ట్యూన్లను వెతుక్కుంటూ, నోట్ బుక్ లోని లిరిక్స్ ని చూస్తుకుంటూ వాయిస్తూనే వున్నారు, అలుపెరగకుండా. 
అతడు డిస్టర్బ్ అవుతాడేమోనని కొంచెం దూరం నుంచే విని, పాట అయిపోయాక వెళ్లి మాట్లాడేను. ఆయన పేరు రాజ్ కుమార్. జీ ఎచ్ ఎమ్ సీ లో పనిచేసి రిటైర్ అయ్యారు. హార్మోనికా క్లబ్ సభ్యులు. కనీసం ఓ నలభై ఏళ్లుగా మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తున్నారు.
"ఎంత గొప్ప ట్యూన్," అన్నాను, ఓ ఆర్ డి బర్మన్ పాట అయిపోయాక.
ఇక తాదాత్మ్యంతో చెప్తున్నాడు, ఆయన ఎంత గొప్ప కంపోజరో. "He died too young. Had he lived longer, we would have got scores of tunes more."
పిల్లలకు ప్రతీ ఆదివారం ఉచితంగా నేర్పుతున్నారట, ఇందిరా పార్కులోనే.
ఈరోజు వాకింగ్ కి వెళ్లడం ఎంత మంచిదైందో కదా అనుకున్నాను.
బహుశా, అందుకే ఖలీల్ జిబ్రాన్ అన్నాడు,
"In the dew of little things the heart finds its morning and is refreshed."
How true! My morning was refreshed.







June 21, 2016

యోగాసనాలు వెయ్యండి. వేస్తే....


Source: Artist unknown, from Pinterest
      నల్లడబ్బు ఇండియాకి రాలేదన్న,
      మాల్యా వెనక్కి రాడేమోనన్న,
      ధరలు కిందకి దిగవేమోనన్న, 
      ప్రత్యేక హోదా ఇవ్వరేమోనన్న, 
      ఉద్యోగాలు రావేమోనన్న,
     పొలాలు పోతా ఏమోనన్న, 
     ఆత్మహత్యలు ఆగవేమోనన్న, 
     అత్యాచారాలు ఎంతకాలమిలా అన్న, 
     పన్నులు పెరగడం ఆగదా అన్న,
     ........ 
     తుఛ్ఛమైన సందేహాలు, భయాలు, ఆందోళనలు 
     కలగకుండా హాయిగా వుంటుంది. 

    యోగా చేసేక కూడా మీకు ఈ సందేహాలు, భయాలు,    
    ఆందోళనలు ఉన్నాయంటే అర్ధం మీరు యోగా సరిగా చెయ్యడం     లేదు. లేదా మీరు జాతి వ్యతిరేకులు అయి వుండాలి.  
    మీరు దోచుకోండి, వేల కోట్లు కొల్లగొట్టి దేశం విడిచి పారిపొండి
    లేదా మతం పేరుతో, కులం పేరుతో మనుషుల మధ్య    
    బ్రహ్మచెముడు కంచెలు వెయ్యండి, ఆదివాసుల కాళ్ళ కింద  
    భూమి లాగేసుకుని గనులు తవ్వండి, -- కానీ యోగా చెయ్యండి.  
    మనసు ప్రశాంతంగా వుంటుంది. 
    మీ మనసు ప్రశాంతంగా లేకుండా చేసే వాళ్ళతో యోగా  
    చేయించే పూచీ మాది. యోగా చేయించి వాళ్ళ మనసు
     ప్రశాంతంగా వుండేటట్టు చేస్తాం.

మీరు యోగా మొదలెట్టేరా లేదా? మొదలు పెట్టండిత్వరగా.
మీరు శలభాసనం వేసేలోగా
అన్నిట్లోనూ విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చేయాలి.
మీరు యోగా మొదలెట్టేరా లేదా? మొదలు పెట్టండిత్వరగా.
మీరు భుజంగాసనం వేసేలోగా
తీరం వెంబడి ఓ నాలుగు అణువిద్యుత్ కేంద్రాలు పెట్టెయ్యాలి
మీరు యోగా మొదలెట్టేరా లేదా? మొదలు పెట్టండిత్వరగా.
మీరు కుక్కుటాసనం వేసేలోగా 
మీ భూముల్ని ముంచేసే ప్రాజెక్టుని ఓకే చేసెయ్యాలి 

యోగా బాగా చెయ్యండి, మీకు చాల అవసరం. 
తర్వాత మళ్ళీ చెప్పలేదంటారు
మీ మనసు, ఆరోగ్యం బాగుండాలంటే 
యోగా చాలా అవసరం.

వేశ్యకి వ్యభిచార దోషం ఉండదు
రాజకీయనాయకులకు అవినీతి దోషం, హత్యా దోషం ఉండదు.
శీర్షాసనం వేసేక కూడా మీకు ఈ సంగతి మీకర్ధం కాకపోతే
మీకిక శాశ్వత శవాసనమే.





June 17, 2016

నకిలీ -- బాబాలు, నాయకులు



(ఫోటోలో, లైఫ్ స్టైల్ భవనం యజమాని
 బురిడీ కొట్టి కోటిన్నర కొట్టేసిన నకిలీ బాబా)
"అంత  చదువుకున్న వాడు, డబ్బున్న వాడు అంత అవివేకంగా దొంగ బాబాకి ఎలా లొంగిపోయాడు? అత్యాశ కాకపోతే ఎక్కడైనా డబ్బు వూరికే రెట్టింపు అవుతుందా? ఆమాత్రం  ఆలోచన ఉండొద్దా?," ఇది ఓ మిత్రుడి కామెంట్. 

నేను అన్నా,

నరమేధం చేసినవాడు దేశాన్ని బాగుచేస్తానంటే,
వెన్నుపోటు పొడిచిన వాడు సింగపూర్ ని చేస్తానంటే, 
ద్రోహుల్ని ఆలింగనం చేసుకుంటున్న వాడు
మన బతుకుల్ని బంగారం చేస్తానంటే,
నమ్మ లేదా? నమ్మటం లేదా? 
వాళ్ళనే నమ్ముతాం కానీ,
మన బతుకులు బండ బతుకులుగానే వున్నాయని
ఎండమావుల వెంటే మనల్ని పరిగెత్తిస్తున్నారని
చెప్పేవాళ్ళని  నమ్ముతామా?
నమ్మం కాక నమ్మం 
అంతే,
దోచుకునే బాబాలను నకిలీ బాబాలుగా గుర్తించినట్టు 
దోచుకునే నాయకులను నకిలీ నాయకులుగా గుర్తించం.

May 06, 2016

కమలిని కథ గురించి ....

    సామాన్య రాసిన కథ నిన్నటి వరకు చదవలేదు -- కల్పన గారు సారంగ లో ఈ కథ మీద చర్చ చేసే దాకా. కథల మీద ఎంత చక్కగా చర్చ చెయ్యవచ్చో, చెయ్యాలో ఈ విమర్శ చెప్తుంది. 
కథ రాసే పద్ధతిపై, నిర్వహించే పద్ధతిపై కథకురాలి స్వేఛ్చని గౌరవిస్తూనే, తన అభిప్రాయాన్ని చెప్పేరు కల్పన.
(సామాన్య కథనీ, కల్పన విమర్శనీ ఇక్కడ చూడవచ్చు, మీరిదివరకే చదివి ఉండకపోతే.)   

http://magazine.saarangabooks.com/2016/04/28/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80-%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%B2%E0%B1%87/

వివాహేతర సంబంధంలోకి అనుకోకుండా వెళ్ళిన ఓ మహిళ పశ్చాత్తాపం గురించిన కథ. తనెలాటి పరిస్థితిలో  సంబంధంలోకి వెళ్ళాల్సివస్తుందో సహచరుడికి ఉత్తరం ద్వారా చెప్తుంది కమలిని. 
కథ చదివిన వెయ్యిమంది వెయ్యి రకాలుగా అర్ధం చేసుకుంటారు. వాళ్ళ వాళ్ళ అభిరుచులు, అవగాహన, ప్రాపంచిక దృక్పథం, అనుభవాలు (సొంతవీ, ఎరిగిన వాళ్ళవీ) - ఇలా ఎన్నో అంశాలు ఆధారపడి వుంటాయి అర్ధం చేసుకునే ప్రాసెస్ లో.

  ఇలాటి ఇతివృత్తాలతో ఇంగ్లీషులో, హిందీలో, మలయాళంలో, బెంగాలీలో ఎన్నో కథలు వచ్చాయి. వేయి ముఖాల జీవితంలోని అంతగా వెలుగుపడని అంశాల గురించి సామాన్య రాయడం అభినందనీయం. ఇరవై ఏళ్ల క్రితం ఓం పూరి, రేఖ నటించిన ఆస్థా అని సినిమా ఇలాటి 'పశ్చాత్తాపాన్ని' గొప్పగా డీల్ చేస్తుంది. 
  పురుషుడు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం సామన్యమైపోయి, అవే పనులు స్త్రీలు చేస్తే కొంపలు మునిపోయినట్టు,పవిత్ర భారతీయ సంస్కృతికి అపరాచారం జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టడం కొత్త కాదు.
  కమలిని మీద కల్పనకి వున్న విమర్శే నాకు కూడా వున్నది. కల్పన చెప్పినట్టు గానే అది నా సబ్జెక్టివ్ అభిప్రాయం కావచ్చు. ఆమె దీనంగా కాకుండా, బతిమాలుతున్నట్టుగా కాకుండా వుండి వుంటే బాగుంటుందని నాకు అనిపించింది.
వివాహ బంధాల్లో వుండే పరస్పర గౌరవం దెబ్బతిందని ఇద్దరూ, లేదా ఒకరు భావించినపుడు అవి వాటిని ఎలా పరిష్కరించుకుంటారు, పరిష్కరించుకోవాలి అన్న అంశాల మీద ఇదివరకే పెద్ద చర్చలు నడిచాయి. సహచరులను పూర్తిగా అర్ధం చేసుకున్న వారున్నారు. ద్రోహం జరిగిందని భావించి పట్టరాని ఆగ్రహంతో సంబంధాన్ని తెంపుకున్న వారున్నారు.
ఈ కథలో దీపూ కమలినిని అమితంగా ఇష్టపడ్డట్టు, ప్రేమించినట్టు తెలుస్తుంది కానీ, అతడికి  ఏ మేర ప్రజాస్వామిక భావాలున్నాయో  (ఆమెకి ఇష్టమైన ఆహారం తయారుచేసే పని చేస్తుండడం మినహా) మనకి సూచన లేదు.
  లేఖ రాసిన పధ్ధతి మీద కూడా  నాకో విమర్శ వున్నది. లేఖ టోన్ రొమాంటిక్ గా వున్నది. ఇదివరకు సామాన్య లేఖ రూపంలో ఒక కథ రాసేరు (తెలంగాణ ఉద్యమ కాంటెక్స్ట్ లో). ఆ కథ సారంతో నాకు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ కథకి ఆ లేఖ టోన్ సరిపోయింది.
కానీ, ఈ ఇతివృత్తం రొమాన్స్ కి సంబంధించినది కాదు. ఉద్యోగం చెయ్యాలా వద్దా, ఇల్లు కొనాలా వద్దా లేకపోతే పిల్లలు వుండాలా వద్దా (లేదా అప్పుడే వద్దా ), రాష్ట్రాలుగా విడిపోవాలా వద్దా  లాటి అంశం కాదు. ఇద్దరి (wed lock లో వున్న) మనుషుల మధ్య సంబంధంలో చాల డెలికేట్ అంశానికి సంబంధించిన అంశం. కాబట్టి లేఖ టోన్ భిన్నంగా వుంటే బాగుండేదని నాకనిపించింది. 
కమలిని కొన్ని చోట్ల బోల్డ్ గా ఎసర్టివ్ ఉన్నట్టుగా అనిపించడం వల్ల ఆమె మీక్ గా రాయడం బాగుండలేదు. 
  కథని ఓపెన్ గా వదిలెయ్యడం బాగుంది. లేఖ చదివి ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు, దానికి ఆమె ఎలా స్పందించి వుండేది అని, అప్పుడేమయ్యేది అన్న ప్రశ్నలు పాఠకుడిని వెంటాడుతాయి.

  కల్పన రాసిన ప్రతిస్పందనకి వచ్చిన అభిప్రాయాల్లో కొన్ని అన్యాయంగా వున్నాయి. కథలో రాసిన కొన్ని అంశాలకు రచయిత్రి అభిరుచులకి ఆపాదించడం అన్యాయం, అనుచితం. .

Telangana: Heat and dust: Acute Drought threatens livelihoods

Heat and Dust: Telangana Acute drought hits life in rural Telangana. Severe shortage for drinking water for people and cattle. With three consecutive droughts hitting them very hard, farmers gear up for a crop season with lots of doubts and concerns. The story on drought in Telangana in Business Line as part of a national series on the subject.

An acute drought has compounded the State’s agrarian crisis and triggered large-scale migration
The oppressive 43° C heat of an early summer afternoon has Mominpet, in Ranga Reddy district, firmly in its grip. At the panchayat building premises, about 50 farmers from the village are clustered beneath the only tree that offers a modicum of shade and respite from the hot Deccan winds that blow.
They have gathered at the panchayat office for the annual Rythu Chaitanya Yatra meet organised by the Telangana Agriculture Department officials to offer advice to and prepare farmers for the upcoming kharif season.
Hot though the day is, the farmers have a bigger concern on their minds as they listen to Mandal Agriculture Officer K Neeraja with rapt attention as she briefs them on the strategy they should follow for the agricultural season.
What acutely bothers the farmers is the scarcity of water resources for the third year running. Borewells have dried up, and the South-West and North-East monsoons have been deficient.
This has left the farmers saddled with a dilemma: should they continue with cotton cultivation, which is hugely input-intensive and has left them in big debt?
Or should they go in for soya or maize cultivation, as is being suggested by the State government? And how can they continue to feed their cattle, given that feed stocks are drying up?
Agrarian crisis

The farmers’ plight has been compounded by an agrarian crisis in the State, and particularly in the cotton sector: about 1,500 farmers have committed suicide since the Telangana State was formed in June 2014. Over two-thirds of them were cotton farmers, which could be one reason why the State government is encouraging them to diversify away from cotton to other crops.
Lack of access to institutional finance is the biggest challenge that farmers face, and it is this that drives them to secure loans from private lenders at usurious rates.
The State government has waived about half of the ₹17,000 crore loans, and is expected to release about ₹4,250 crore this year and an equal amount next year.
As soon as Neeraja finishes reading out the message from Chief Minister K Chandrasekhara Rao to farmers on the State’s plan for this year’s kharif and various schemes that the government has introduced, the farmers begin to pepper her with questions on the alternatives, their viability and the availability of seeds.
The same questions resonate along the 85-km road to Mominpet, with villagers wondering as to how the drought situation will play out.
Leaving nothing to chance, the farmers have kept their fields tilled and ready for the first showers, should they come.
Tanker trade thrives

Chandraiah, the Sarpanch of Mominpet, additionally faces the challenge of having to provide drinking water to the 13,000 villagers.
The severe drought that has engulfed the mostly rain-fed Telangana, drying up tanks and groundwater sources, is impacting life in the State, particularly the rural areas. Big tankers ply on the roads, ferrying water to the villages from borewells near the dried-up tanks.
“It is very big business now. Everybody wants water. But the problem is there are only a limited number of tankers,” Narsimhulu, a villager, said.
The situation is much the same in other villages.
“Some farmers are lucky that their borewells still provide some water, but a majority of us are not that lucky. There’s a shortfall of at least 40 per cent in groundwater resources,” A Ravi, a small-time farmer, says. This year, summer came quite early, its arrival heralded by unprecedented heat waves across the State. A sudden spurt in temperatures forced the government to wind down the academic year two weeks early.
Private schools that violated the closure guidance were warned of stringent action.
The failure of three successive crop seasons has led to a scarcity of pulses, driving up their prices. Black gram and red gram prices have risen past ₹200 a kilogram.
Prof M Kodandaram, Convenor of the Telangana-Joint Action Committee (T-JAC), points out that farmers have spent heavily on borewells and on digging wells.
No fallbacks for farmers

“For want of water and fodder, they are selling their cattle. But there has been a fall in cattle prices because of the increased availability. The income from cattle used to serve as a buffer in times of crisis. Now they are left with no fallbacks,” he said.
The T-JAC deputed a team to nine of the 10 districts in Telangana to assess the situation and prepared a report on the drought. The report noted that the drought situation was very grave, and recorded villagers as having said that they had not seen one so bad in 50 years.
Large-scale migration

The drought has induced large-scale migration of people within and from the State. Unable to find livelihood and water, people are moving to urban areas in the thousands.
Mahboobnagar, from where the most number of people migrate to cities, is witnessing acute drought.
“Earlier, people used to migrate with the help of organised cliques. Now, they leave the villages on their own, hoping to find some livelihood in Hyderabad or Mumbai,” says Raghavachari, a retired teacher who has been studying the phenomenon for the past year 30 years.
“You can see them in groups at streetcorners in Hyderabad in the mornings looking for construction work. The drought is so acute that parents are taking their kids too with them to far-off places in search of work,” he said.
The government, however, is not fully sensitive to the gravity of the situation.
Agriculture and Cooperation Minister Pocharam Srinivas Reddy appeared to evade an answer to a question on the State government’s contingency plan for farmers in the drought-hit areas.
Traditional indices to estimate the extent of the drought are inadequate, notes Raghavachari.
“They track specific parameters like rainfall. But the impact of the drought is felt well beyond agriculture. You must factor in the effects on the socio-economic fronts too to assess the actual impact,” he feels.
Some of the villagers, for instance, are migrating to Mumbai along with their kids, resulting in large-scale dropouts from schools, he adds.
Overall, the situation in drought-hit Telangana borders on the grim, with no early respite in sight.
(This article was published on May 5, 2016)

Original Link to the story:
http://www.thehindubusinessline.com/specials/telangana-heat-and-dust/article8561722.ece

May 04, 2016

మీరు జర్నలిస్టా? అయితే మీకివి గేరంటీ

"కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటొచ్చు కానీ,
కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేరు ఎవరూ" 

(ఇవే లైన్లు కావు. కానీ అదే అర్ధం వచ్చే లైన్లు) అని కవి-జర్నలిస్టు మిత్రుడు వసీరా ఓ రెండు దశాబ్దాల కింద ఓ గొప్ప కవిత రాసేరు. రెండ్లు లైన్లలోనే గొప్ప జీవిత సత్యం చెప్పేరు. జర్నలిస్టు కూడా కాబట్టే ఆయన అలా రాయగాలిగేరని నా అభిప్రాయం. జీవితం మెలిపెట్టి తిప్పుతుంటే దుఖ్ఖ పడకుండా, మనసులోనైనా కన్నీళ్లు కార్చకుండా ఎవరు రోజు గడపగలరు?

అయితే, జర్నలిస్టులకు ఇంకొన్ని అదనపు గేరంటీలు వున్నాయి. కన్నీళ్ళతో పాటు, వీటిని కూడా తోడ్కొని పోవాలి వాళ్ళు.


ఇవి రావాలని ఎవరినీ అశీర్వదించడం లేదు. కోరుకోవడం లేదు. రాకుండా వుంటే మంచిది. రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని. Occupational hazards కదా, తప్పవు. You have to live with it. You can't wish it away.
మీరు జర్నలిస్టు అయితే ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి గానీ, ఒకటి కంటే ఎక్కువగానీ వచ్చే అవకాశాలు ఎన్నో వున్నాయి.

1) వెన్ను నొప్పి
2) కాళ్ళు లాగడం
3) తలనొప్పి
4) బీపీ
5) షుగర్
6) కిడ్నీలో రాళ్ళు
7) ఫేటీ లివర్
8) డిప్రెషన్
9) డి-విటమిన్ లోపం
10) అప్పులు

ముందో వెనకో, అదో ఇదో ఖచ్చితంగా వచ్చే జబ్బులు ఇవి. కొన్నిటిని కొంతకాలం వాయిదా వెయ్యవచ్చు. అపారమైన అనుభవమున్న జర్నలిస్టులు ఈ లిస్టుకి ఇంకా add చెయ్యవచ్చు.
ఈ పదిలో ఏవైనా తప్పించుకోవచ్చు కానీ ఒకటో దాన్నీ, పదో దాన్నీ ఎవరూ తప్పించుకోలేరు.
తప్పించుకోలేనివి ఎలానూ తప్పించుకోలేరు, తప్పించు కోగలిగేవి లేదా వాయిదా వేసుకోగలిగేవి తప్పించుకునే, వాయిదేవేసుకునే ప్రయత్నం చెయ్యండి.



May 02, 2016

సిద్ధాంతాల్ని చంపేసి.. శిలావిగ్రహాలు పెడదామే! (విల్సన్ సుధాకర్ కవిత)

  బుధ్ధుడినీ ఇలానే కలిపేసుకున్నారు. ఆయన్ని ఓ విగ్రహాన్ని చేసేసి, ఆయన చెప్పిన విలువల్ని మంటకలిపేసి, ఆయన్ని ఓ విగ్రహం చేసేసి తమలో కలిపేసుకున్నారు.    ఇప్పుడు ఇక నిస్సిగ్గుగా అంబేద్కర్ ని కలిపేసుకుంటున్నారు. కారంచేడు, చుండూరు, వేంపెంట, ఖైర్లాంజీ, ఇంకా అనేకానేక గ్రామాల్లో, అగ్రహార విద్యాలయాల్లో దళితుల్ని అణచివేసిన రాజ్యం అంబేద్కర్ ని ప్రేమించడం మొదలుపెడుతుంది. 
   అంబేద్కర్ ఎవరికోసమైతే నిలబడ్డాడో, ఎవరి హక్కులకోసమైతే జీవితాంతం పోరాడాడో వాళ్ళని ఓ పక్క అణచివేస్తూనే, మరో వైపు ఆయన విగ్రహాల్ని పెట్టిస్తుంది. ఎవరూ అందుకోలేనంత ఎత్తుకెదిగిన మనిషిని ఓ వంద అడుగులకు కుదించి, ఆయన చూపుడు వేలు ఎటు చూపిస్తుందో అటు ఎవరూ చూడకుండా చేస్తుంది. ఈ ఎత్తుని పసిగట్టిన సుధాకర్ రాసిన కవిత . (ఆంధ్రజ్యోతి, వివిధ, 02-05-2016)


వాళ్ళెలాగూ 
ఆ సజ్జనుడి విగ్రహం పెట్టక తప్పదు 
సజ్జచేలో కంకులపై సహజంగా వాలే పక్షుల్ని 
కర్రలతో కట్టిన మంచె పైనుండి వడిసెల రాళ్ళతో కొట్టి తరిమినట్లు 
పీడితజన పౌరహక్కుల ‘బెల్వెడెరే’గా మారిన లిబర్టీని 
అంబేడ్కర్‌ పేరు తెలియని ఘోరీల పక్కకు తరలిస్తారు 
మనోభావాల్ని 125 అడుగుల ఎత్తున పెంచి పోషించి 
‘జైభీమ్‌’ నినాదాలిస్తూ జయప్రదంగా కోసుకుపోతారు 

బోధి వృక్షం నేనంటే నేనని 
రావిచెట్లు చేసిన ప్రాయోజిత వీధి సత్యాగ్రహంలో సైద్ధాంతిక గాయాలయితే 
ఆ గాయాల్లో వేలుపెట్టి తిప్పిన థామస్‌ నువ్వవుతావు 
ఇప్పటికైనా ఎత్తైన విగ్రహం ముందు నిలబడి చూడు 
నువ్వెంత అల్పుడివో స్పష్టంగా కనబడతావు 

ఉమ్మడి పీడ విరగడయ్యిందనేగానీ 
ఉమ్మడి రాడార్లతో మన పల్లవినే వాళ్లు కనుక్కుని 
ఉభయభ్రష్ట తెలుగులోనే మన సిలువలపై రాగం తీస్తున్నప్పుడు 
నీకు తెలియని ‘అబద్ధపు పేతురు’ నీలో ప్రవేశిస్తే 
ఆ గాన స్రవంతిలో నువ్వొక నేపధ్యవరుసవౌతావు 
మనసుల్లోని మూర్తిమత్వాన్ని అడుగుల్లో కొలుచుకుపోతున్నప్పుడు 
భావజాల వక్రభాష్యంలో విభావరిపై వెలిగిపోతావు 
అస్థిత్వ సారూప్య నాటకంలో మమేకమై ఆంగికమై వాచకమై 
జాతీయ నాటక పాఠశాల విద్యార్థిలా అభినయమౌతావు 
నీ జాతిని ఎరను చేసి మోసగించి గుటుక్కున మింగుతున్నప్పుడు సైతం 
వాగ్దత్తభూమి ఎంతకూ కనబడని ఇవాంజెలికల్‌ ఆంధ్రలోనే మునిగిపోతావు 

నలుగురితో ‘నవయాన’ గనక 
ఏడాదికొకసారి టాంక్‌బండ్‌ మీద షామియానాలు వేస్తారు గనక 
బాదుకున్న గుండెలతో నువ్వు చేసుకున్న ఆత్మవిశ్లేషణల ఆత్మహత్యలు చాలుగానీ 
విస్మరించిన చరిత్రకోసం చేసిన విసుగులేని పోరాటంలో 
ఆయన రాసిన పుస్తకంలో ఒక్క అక్షరానికైనా అర్ధం చెప్పగలవా! 
మూడు పోగుల నీలి సూట్‌లో నిలబడి 
ఒక చూపుడు వేలు ఆకాశంవైపు చూపించే ప్రతిమ 
పార్లమెంటు నుంచి పల్లెటూరు దాకా సర్వవ్యాపిగా ఎలా మారిందో వివరించగలవా! 

అభినవ బోధిసత్వుడిని 
అమరావతి నిత్యకూలీల జరీబు భూముల్లో 
స్థానక భంగిమన కాంస్య విగ్రహం నిలిపితే మాత్రం 
అనంగీకార కత్తితో మాలమాదిగల్ని రెండుగా నరికిన స్తపతి 
శ్రమజీవుల ప్రతిమాశాస్త్రాన్ని రక్త హస్తాలతో ఎలా రచిస్తాడు! 
ఇంకా క్షమాపణలు చెప్పని కారంచేడు కంచికచెర్లల్లో 
విల్లులెక్కుపెట్టిన అంగుళీమాలుర హస్తకళాకౌశలంపై 
శాఖ్యమునులు ఎలా మౌనం వహిస్తారు! 

ఇంట్లో అంబేడ్కర్‌ ఫోటోనైనా పెట్టుకోలేనప్పుడు 
వంటిట్లో మాత్రం నీకోసం కన్నీళ్ళెందుకు విడుస్తాడు! 
ఉద్యమించే దేశబాలలకోసం మద్దతు పలకనివాడు 
దళితుడు-సమాజహితుడు-రోహితాసుతుడు మరణంపై నోరెత్తని వాడు 
సమ్మతం కాని మతపు ‘భూసూక్తం’ దగ్గరుండి చదివించిన వాడు 
బహుజనుల ఉప ప్రణాళికలు పాతిపెట్టే పథకాలకు రిబ్బన కత్తిరిస్తాడు 
ఒక్కసారైనా ఎత్తైన విగ్రహం ముందు నిలబడు 
నువ్వెత అల్పుడివో స్పష్టంగా కనబడతావు 

విగ్రహం పెడుతున్నందుకు ఎవరికెందుకు బాధ! 
భద్రతకు-ఐక్యతకు-విద్యకు-గుర్తుగా 
విస్మరించిన సంస్కృతి చరిత్రలపై పోరాటానికి సాక్ష్యంగా 
విగ్రహం పెడుతున్నందుకెందుకు బాధ! 
విగ్రహమాత్రుడ్ని చేస్తున్నందుకే బాధ!! 

- తుల్లిమల్లి విల్సన్ సుధాకర్‌
                                                                                                  09538053030
లిబర్టీ- టాంక్‌బండ్‌ దగ్గర ఉన్న లిబర్టీ సర్కిల్‌ 
థామస్‌- గాయాల్లో వేలుపెట్టి చూడమని యేసు ప్రభువు తన శిష్యుడు థామస్‌ను కోరతాడు 
(జర్నలిస్ట్‌ మిత్రుడు కె.వీ. కూర్మనాధ్‌ కోసం... తెలుగు రాష్ట్రాల్లో పెట్టనున్న అంబేడ్కర్‌ విగ్రహాలకు మద్దతుగా)

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...